Tiruvuru Murder: కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఈ నెల 23న దారుణ హత్యకు గురైన కళ్యాణపు కృష్ణ చైతన్య (26) అనే యువకుడి మర్డర్ను 36 గంటల్లో మిస్టరీని పోలీసులు చేధించారు. హత్యకు పాల్పడిన మనుకుంట్ల శ్రీను(బాబు) మరియు అతని అనుచరులు ఏడుగురిని విజన్ స్కూల్ సమీపంలో (Tiruvuru Murder) పట్టుకున్నారు.
ఏ-1 నిందితుడైన మునుకుంట్ల శ్రీను మృతుడు కళ్యాణ కృష్ణ చైతన్యకి మధ్య డబ్బు విషయంలో వివాదం ఉన్నట్టు పోలీసులు మీడియాకు తెలిపారు. హత్యకు నిందితులు కత్తులు, గొడ్డళ్లు, రాళ్లను ఉపయోగించారని నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు మీడియా ఎదుట తెలిపారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలిస్తున్నట్టు పేర్కొన్నారు.
కేసు మిస్టరీని చేధించి నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన తిరువూరు సిఐ ఆర్.భీమరాజు, సబ్ ఇన్పెక్టర్లు దుర్గా ప్రసాద్, పద్మారావు, గంపలగూడెం ఎస్సై సతీష్, విస్సన్నపేట ఎస్సై కిషోర్, హెడ్ కానిస్టేబుళ్లు మాధవరావు, శ్రీనివాసరావు, బాబురావు, కామేశ్వరరావు, కానిస్టేబుళ్లు తిరుపతిరావు, సత్యానారాయణ ను డిఎస్పీ అభినందించారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!