Railway man నీ సాహసానికి సలాం! ఒక సెకను ఆలస్యమైనా అంతే!
Railway man : ఒక్క సెకను ఆలస్యమైతే ఆ పట్టాలపై పడిపోయిన బాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవేమో. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలేదేమో!. కానీ ఓ రైల్వేమాన్ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి ఆ బాలుడుని ఆపద్భాంధవుడిలా కాపాడాడు. ఇప్పుడు ఆ రైల్వే మాన్ పై దేశం మొత్తం ప్రశంసలు కురిపిస్తుంది. అసలు ఏం జరిగిందంటే.. నిర్మానుష్యంగా ఉన్న ముంబైలోని వెంగని రైల్వేస్టేషన్ ఫ్లాట్ఫామ్పై ఓ బాలుడు, బాలిక నడుచుకుంటూ వెళుతున్నారు. అందలోనే ఆ బాలుడు ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయాడు.
అప్పటికే ఆ పట్టాలపై ఓ రైలు వేగంగా వస్తూ ఉంది. దీంతో ఆ బాలిక గట్టిగా అరుస్తూ బాలుడిని పైకి రావాలంటూ కోరుతోంది. ఇది గమనించిన మయూర్ షెల్కే అనే రైల్వేమన్ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. పట్టాలపై నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి చాకచక్యంగా బాలుడిని ఫ్లాట్ఫాంపై ఎక్కించాడు. వెంటనే అతను కూడా ప్లాట్ఫాంపై ఎక్కాడు. సెకను ఆలస్యమైతే ఆ బాలుడిని రైలు ఢీకొట్టేది. రెప్పపాటులో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆ వీడియోను ట్విటర్ లో పంచుకున్నారు. బాలుడిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన మయూర్ షెల్కే అంటే గర్వంగా ఉందని ప్రశంసించారు.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం