TDP Leader devineni uma: జి.కొండూరు : కృష్ణా జిల్లాలోని జి.కొండూరు పోలీస్స్టేషన్ వద్ద తెలుగుదేశం నేతలను మంగళవారం దాటిన తర్వాతర అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో మాజీ మంత్రి దేవినేని, పట్టాభి, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉన్నారు.
తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగిన మాజీ మంంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ను అర్ధరాత్రి తర్వాత పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారని టిడిపి నేతలు చెబుతున్నారు. దేవినేని సుమారు ఆరు గంటల పాటు కారులోనే కూర్చొని దేవినేని ఉమా ఆందోళన చేశారు. వాహనంలో కూర్చున్న దేవినేని కారు అద్దాలు పగులగొట్టి పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించుకెళ్లారని టిడిపి నేతలు అంటున్నారు.
ఈ నేపథ్యంలో అంతకముందు దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై వైసీపీ వర్గీయులు రాళ్లదాడికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై దేవినేని ఉమా పరిశీలనకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఉమా కారును జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారని, వాహనం చుట్టుముట్టి దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు.
మైలవరం అధికార పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులే దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యాయరని ఆరోపిస్తూ దేవినేని ఉమా జి.కొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
ఫిర్యాదు చేసేందుకు వస్తే అరెస్టు చేస్తారా? :కొల్లు
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిని అద్దాలు పగులగొట్టి అరెస్టు చేయడం దారుణమని టిడిపి నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అరాచకమైన పరిపానల జరుగుతోందని మైలవరంలో జరిగిన ఘటన ఉదాహరణ అని కొల్లు రవీంద్ర అన్నారు.


ఉద్దేశ్యపూర్వకంగా అలజడి సృష్టించారు: డీఐజీ
మాజీ మంత్రి దేవినేని ఉమా ఉద్దేశ్య పూర్వకంగా జి.కొండూరులో అలజడి సృష్టించారని డీఐజీ మోహన్రావు అన్నారు. దేవినేని ఉమాను అరెస్టు చేశామని, 100% పారదర్శకంగా విచారిస్తామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు. దేవినేని ఉమా చర్యలపై ఫిర్యాదు వచ్చినట్టు ఎస్పీ తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.