Medical Bulletin: హైదరాబాద్: రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజా హెల్త్ బులిటెన్ (Medical Bulletin) విడుదల చేశారు. ‘సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. ఈ రోజు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ‘అని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై రేపు మరో బులెటిన్ విడుదల చేస్తామని తెలిపారు. అయితే సాయి ధరమ్ తేజ్తో వైద్యుడు మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. సాయి ధరమ్ తేజ్ను స్పృహలోకి తీసుకురావడానికి వైద్యుడు ప్రయత్నిస్తున్నాడు. అదే సందర్భంలో సాయి తేజ్ స్పృహలోకి వచ్చి మూలుగుతున్నాడు. చేతిలో సిలైన్ బాటిల్ పిన్ను తిప్పుతున్నాడు. కాకపోతే కళ్లు తెరవ లేదు. స్పృహ మాత్రం వచ్చింది.


మరో వైపు సాయి తేజ్ను పలువురు సినీ నటులు పరామర్శిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు సాయితేజ్ను ఉదయం పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!