nepal india border : పొరుగున ఉన్న నేపాల్ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సరిహద్దులు మూసివేసేందుకు నిర్ణయం తీసుకుంది. దాదాపు 22 ప్రదేశాల్లో సరిహద్దులు మూసివేసింది.
nepal india border : భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో సంబంధం ఉన్న 22 సరిహద్దు పాయింట్లను మూసివేయాలని నిర్ణయించింది. మరోవైపు ఐర్లాండ్ సైతం భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్లో ఉండాలని ఆంక్షలు విధించింది. నేపాల్ – భారత్ మధ్య మొత్తం 35 సరిహద్దు పాయింట్లు ఉండటా అందులో 22 పాయింట్లను మూసివేయాలని, నేపాల్ కోవిడ్ క్రైసిస్ మేనేజ్మెంట్ కో ఆర్డినేషన్ కమిటీ మంత్రి మండలికి సిఫారుసు చేసింది. భారత్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని నేపాల్ వెల్లడించింది.
ఇక భారత్లో కరోనా విజృంభణ దృష్ట్యా ఐర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా హోటళ్లలో క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది. భారత్తో పాటు జార్జియా, ఇరాన్, మంగోలియా, కోస్టారికా దేశాలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. క్వారంటైన్ కోసం ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించింది.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం