Nagadu badili Pathakam | రేషన్ కార్డుదారులు అవసరమైతే బియ్యానికి బదులు నగదు(cash transfer scheme) తీసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. మే నెల నుంచి ఈ నగదు బదిలీ కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అంగీకరించిన కార్డుదారులకు బియ్యానికి బదులుగా ప్రతినెలా నగదు పంపిణీ చేయనున్నారు.
ఇక మీదట రేషన్ కార్డుదారులు అవసరమైతే బియ్యం తీసుకోవచ్చు. వద్దంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులు ఇస్తుంది. మే నెల నుంచి నగదు బదిలీ కార్యక్రమం అమలు దిశగా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అంగీకరించిన కార్డుదారులకు బియ్యానికి బదులుగా ప్రతి నెలా నగదు(Nagadu badili Pathakam) పంపిణీ చేస్తారు. తొలుత కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది.
దీనిపై ఈ నెల 18 నుంచి 22 వరకు వాలంటీర్ల ద్వారా అంగీకార పత్రాలు తీసుకుంటారు. 23న విఆర్వో పరిశీలన, 25న తహశీల్దార్ ఆమోదం తీసుకుంటారు. కార్డుదారులకు కిలోకు ఎంత ఇవ్వాలనేది ఇంకా నిర్ణయించలేదు. రూ.12 నుంచి రూ.15 మధ్య ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
బియ్యం కావాలంటే తీసుకోవచ్చు!
బియ్యానికి బదులుగా నగదు ఇవ్వడంపై ముందుగా కార్డుదారుల అభిప్రాయం తీసుకుంటారు. వారు అంగీకరిస్తే నగదు ఇస్తారు. రెండు నెలల పాటు నగదు తీసుకున్నా ఆ తర్వాత నెలలో కావాలంటే బియ్యం తీసుకోవచ్చు. మొదట వాలంటీర్ల ద్వారా నగదు అందించాలని యోచిస్తున్నారు. అనంతరం ఖాతాల్లోకి బదిలీ చేసే ప్రతిపాదన ఉంది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ