Mylavaram newsకృష్ణా జిల్లా మైలవరం మండలం మొరుసుమల్లి గ్రామ శివారు వద్ద శనివారం దారి దోపిడీ వెలుగు చూసింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, కొత్తగూడెంకు చెందిన మోహన్రావు, సురేష్ ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంటారు. ధాన్యాన్ని రెండు లారీల్లో, కాకినాడ దగ్గర చొల్లంగి, మండపేట రైస్ మిల్లర్లకు దిగుమతి చేశారు. మండపేటలో రూ.7 లక్షలు ధాన్యం డబ్బులు లారీ డ్రైవర్లు తీసుకున్నారు. రెండు లారీల్లో ఒక లారీ డ్రైవర్ వద్ద ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు ఉంచారు.


తిరుగు ప్రయాణంలో మైలవరం(Mylavaram news) మండలంలోని వెనుక లారీ డ్రైవర్ వద్ద ఉన్న సొమ్మును దొంగిలించి దోపిడీ దారులు పారిపోయారు. డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో మైలవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. వెంటనే ప్రత్యేక బృందాలు గాలింపు చర్య చేపట్టాయి. అయితే రెండు లారీల్లో ఒక లారీ డ్రైవర్ తోటి డ్రైవర్లకు సమాచారం ఇచ్చి దొంగతనానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి విచారణలో కేసు వివరాలు వెల్లడి కానున్నాయి.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!