MP Sanjeev Kumar | కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ను ఓ సైబర్ మోసగాడు బురిడీ కొట్టించినట్టు తెలుస్తోంది. బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని, దానిని వెంటనే Pan నెంబర్తో అప్డేట్ చేసుకోవాలంటూ మొన్న ఆయన మొబైల్కు ఓ మెసెజ్ వచ్చింది. Update చేసుకునేందుకు కింద లింక్ కూడా ఉండటంతో నిజమేనని నమ్మిన ఎంపీ వెంటనే లింకు ఓపెన్ చేసి వివరాలు పూర్తి చేసి Send చేశారు. వెంటనే ఆయన మొబైల్ కు OTP వచ్చింది. ఆ వెంటనే HDFC కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటిపి నెంబర్లు అడిగి తెలుసుకుని ఖాతా అప్డేట్ అయిపోతుందని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
ఆ తర్వాత కాసేపటికే ఒకసారి రూ.48,700, మరోసారి రూ.48,999 డ్రా అయినట్టు MP Sanjeev Kumar మొబైల్కు మెస్సేజ్ వచ్చింది. అది చూసి కంగారుపడిన MP సంజీవ్ కుమార్ వెంటనే బ్యాంక్కు ఫోన్ చేస్తే మోసం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాడు తనను బురిడీ కొట్టించినట్టు గ్రహించిన ఆయన వెంటనే కర్నూలు రెండో పట్టణ Policeలకు ఫిర్యాదు చేశారు. తన బ్యాంకు ఖాతా నుండి Cyber మోసగాడు మొత్తంగా రూ.97,699 కాజేసినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ నేరగాడి గురించి ఆరా తీస్తున్నారు.