MP Kesineni Nani : Vijayawada: బెజవాడలో టిడిపి ఆధ్వర్యంలో మరోసారి వర్గ విబేధాలు తెరపైకి వచ్చాయి. ఎంపీ కేశినేని నాని మీడియా ఎదుట శుక్రవారం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేవారు. ప్రజలు వ్యక్తిత్వంతో పాటు సమర్థత ఉన్నవాడినే నమ్ముతారని అన్నారు. అవినీతిపరులు, లాలూచీపరులను ప్రజలు ఆమడదూరంలో ఉంచుతారని తెలిపారు. ఓడిపోయిన సామంతులే పార్టీకి నష్టం చేస్తున్నారని ఆరోపించారు. ఓటమి చెందే అభ్యర్థులను మార్చితే తప్పేంటి? అని ప్రశ్నించారు. ముస్లీంల కోసం చంద్రబాబును కూడా కాదని నిలబడ్డానని కేశినేని నాని వెల్లడించారు. ఎవరైనా తన వెనుక రావాల్సిందే తప్ప తాను ఒకరి వెనుక వెళ్లనని స్పష్టం చేశారు. అయితే అందరూ కలిసి వెళ్లాల్సిన సమయంలో పార్టీని దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
పదవుల కోసం కాదు పార్టీ కోసం కష్టపడుతున్నాం!
విజయవాడలోని తాను, తన కుమార్తె మేయర్ పదవి కోసం కష్టపడటం లేదని, తమకు పదవులు అక్కర్లేదని, పార్టీ కోసమే కష్టపడి పనిచేస్తున్నామని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. బెజవాడలో ఇంత జరుగుతున్నా చంద్రబాబుకు తెలియకుండా ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇక్కడి పరిణామాలపై చంద్రబాబు వెంటనే స్పందించి వారిని గాడిలో పెడితే పార్టీకే మంచిదని అన్నారు. గురువారం విజయవాడలో జరిగిన పార్టీ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయులు కేశినేని వర్గాన్ని నిలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేశినేని నాని మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇది చదవండి:మళ్లీ పంజా విప్పుతోన్న కరోనా
ఇది చదవండి: ‘ఉద్దానం’పై ఏం ఆలోచిస్తున్నారు: హైకోర్టు
ఇది చదవండి:దేశంలోనే తొలిసారి మహిళకు ఉరిశిక్ష
ఇది చదవండి: వారికి మరో అవకాశం ఇచ్చిన ఎస్ఈసీ
ఇది చదవండి:కొత్త స్ట్రెయిన్లతో ముప్పు..అప్రమత్తమైన కేంద్రం
ఇది చదవండి:హత్యలు వెనుక టిఆర్ఎస్ పాత్ర: ఉత్తమ్కుమార్ రెడ్డి
ఇది చదవండి:మనిషి మాంసం తినే తెగ గురించి తెలుసా?
ఇది చదవండి:జీతాల్లేవు..భద్రత లేదు!
ఇది చదవండి:తెలంగాణ కోడలను నేను.. విమర్శకులకు షర్మిలా సమాధానం!
ఇది చదవండి:పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య