Mohammed Fareeduddin జహీరాబాద్: న్యాల్కల్ మండలంలోని ముంగి గ్రామంలో దివంగత నేత మాజీ మంత్రి మహమ్మద్ ఫరీదుద్దీన్ జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలను సయ్యద్ శకిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూన్నారు. క్రికెట్ పోటీలను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ ఎమ్మెల్యే మణిక్ రావు, మాజీ మంత్రి కుమారుడు మొహమ్మద్ తన్విర్తో కలిసి ప్రారంభించారు.
2 నిమిషాల మౌనం పాటించిన అనంతరం ఈ సందర్భంగా ఎంపీ బిబి పాటిల్ మాట్లాడుతూ మొహమ్మద్ ఫరీదుద్దీన్ (Mohammed Fareeduddin)లాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని, వారి జ్ఞాపకార్థం ఇక్కడ టోర్ని నిర్వహించడం వారి మీద ఉన్న అభిమానానికి నిదర్శనం అని ఎంపీ బిబి పాటిల్ అన్నారు. ఎంపీటీసీ దేశెట్టి పాటిల్, డిఆర్ యూసీసీ బోర్డు మెంబర్ శేక్ ఫరీద్, న్యాల్కల్ జడ్పీటీసీ ప్రతినిధి భాస్కర్, మండల వైస్ ఎంపీపీ షేక్ గౌస్, డైరెక్టర్ గోవర్థన్ రెడ్డి, టిఆర్ఎస్ జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ మోహియోద్దీన్, టిఆర్ఎస్ యువ నాయకులు బిజి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ