medaram mahajatara 2022 హనుమకొండ: మేడారం మహా జాతరకు ఆర్టీసీ ఏర్పాట్లపై ఈడీ మునీశ్వర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి జాతరకు 3845 బస్సులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ బస్సులలో 21 లక్షల మంది భక్తులను తరలించడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ఇతర జిల్లాలకు చెందిన బస్సులను కూడా వరంగల్ నుండి మేడారంకు నడుపుతున్నామన్నారు. మేడారం బస్సులకు 51 పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. వరంగల్ జిల్లాలో 30 పాయింట్ల నుండి ప్రయాణికులను మేడారం(medaram) తరలిస్తామన్నారు.
వేర్వేరు ప్రాంతాల నుండి వరంగల్కు చేరుకున్నవారు హనుమకొండ నుండి మేడారం(mahajatara 2022)కు సురక్షితంగా చేర్చే విధంగా సర్వం సిద్ధం చేసినట్టు ఈడీ తెలిపారు. మేడారంలో భక్తులను జంపన్న వాగుకు తరలించడానికి మినీ బస్ సౌకర్యం తొలిసారి ఏర్పాటు చేశామన్నారు. 50 ఎకరాల విస్తీర్ణంలో 42 క్యూ లైన్స్ ఏర్పాటు చేశామన్నారు. 30 మంది భక్తులు ఉంటే డైరెక్టుగా ఇంటికే ప్రత్యేక బస్సు సౌకర్యం ఈ నెల 11వరకు అందుబాటులో ఉంటుందన్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!