Manasa Devi: మనసా కశ్యపాత్మజా అని చెప్పే మానసాదేవి ప్రకృతిలో వెలిసిన మూడవ ప్రధానాంశ స్వరూపం. ఈమె కశ్యప ప్రజాపతి మానస పుత్రిక పూర్వ భూమి మీద మనుషులు కంటే అధికంగా ఉండేవట. అవి విచ్చలవిడిగా సంచరిస్తూ మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తుంటే కశ్యపముని తన మనసు నుంచి ఈ ఆది దేవతను సృష్టించాడు. ఈమె సర్పాలకు తిరుగులేని అధినేత్రి, మహాయోగేశ్వరి Mahayogeswari. పరాత్పరున్ని మనసులో నిలుపుకుంటుంది. స్థౄరక నామధేయ, వైష్ణవి, సిద్ధయోగిని, మూడు యుగాల Yougala, పాటు శ్రీకృష్టుని కోపం తపస్సు చేసింది.
మహామునికి వివాహ మాడిన Manasa Devi
జరత్కారు అనే మహాముని కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంటే, ఒక రోజు అతనికి పితృదేవతలు కలలో కనిపించి, నువ్వు వివాహితుడవై ఉత్తమ సంతానం పొంది మాకు పిండ ప్రదానం Pinda Pradanam, చేస్తే ఉత్తమగతులు కలుగుతాయని చెప్తారు. దాంతో కశ్యపముని సలహా మీద మానసాదేవిని పెండ్లాడాడు. పరమశివుడు క్షీరసాగర మధనంలో పోలాహలాన్ని మింగగా, అది ఆయనపై పనిచేయకుండా చేసింది, ఈ Manasa Devi యే. అందుకే ఈమెను విష హరదేవిగాను పిలుస్తారు. గౌరవర్ణం కారణంగా ఆమెను అందరూ గౌరిగా ఆరాధిస్తుండటంతో జగదొలగానూ స్థిరపడింది.
ఆమె శివుడి శిష్యురాల కావడంతో శైవి అనే పేరు కూడా వచ్చింది. Manasa దేవి మొదట విష్ణు భక్తురాలు కనుక వైష్ణవి అయింది. పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడు సర్పయాగం చేసే వేళ పాముల ప్రాణాలను కాపాడింది కనుక నాగేశ్వరి, నాగభగిని అనే పేర్లతోనూ పిలువబడింది. హరుడి నుంచి సిద్ధయోగం పొందినందున సిద్ధయోగినీ అయ్యింది. మరణించిన వారిని బతికించగలదు కాబట్టి మృత సంజీవని, మహాతపస్వి, మహాజ్ఞాని జరత్కారునికి ఇల్లాలైనందుకు జరత్కారువు ప్రియః ఆస్తికుడు అనే మునీంద్రునికి కన్నతల్లి కాబట్టి, ఆస్తికమాతగా పిలువబడింది.
ఇలా Manasa Devi కు మొత్తం పన్నెండు పేర్లు ఉన్నాయి. ఈ నామాలను పూజా సమయంలో పఠించిన వారికి సర్పభయం ఉండదు. పది లక్షల సార్లు పఠిస్తే స్తోత్ర సిద్ధి కలుగుతుందని శాస్త్రం. దీని వల్ల మహావిషం తిన్నా జీర్ణించుకోగలుగుతారట. పడగెత్తిన Paamu ను వాహనంగా చేసుకున్నందుకు నాగ గణమంతా ఆమెను సేవిస్తుంటారు. యోగినే కాక నాగసాయిని కూడా తపస్వరూపిణి, తపస్విలకు తపఃఫలాన్నిచ్చే తల్లిగానూ మానసాదేవిని భారతీయులు ఆరాధిస్తారు. జీవులన్నింటిలో భగవంతుడున్నాడని, ఏ ప్రాణినీ బాధించకూడదని, దీనివల్ల జరిగే మేలు దానివల్ల జరుగుతుందని మన ధర్మశాస్త్రం Dharmasastram, లో చెప్పినట్టుగానే సర్పపూజ కూడా ఆచరణలోకి వచ్చింది.
హరిద్వార్లో మానసాదేవి
సర్పాల (Snake) కు గుళ్లూ గోపురాలు పెద్దగా లేకున్నా ప్రకృతితో పాటు సర్పారాధన ఆనాదిగా మనకు ఆచారమైంది. ఆ సర్పాలకు అధిపతి ఈ దేవియే. మానవ సంతానానికి, సంపదలకు కూడా ఈ తల్లియే అధిపతి. Haridwar లో మానసాదేవి ఆలయం ఉంది. ఈమె దయతోనే మనకు నాగుల అనుగ్రహం లభిస్తుంది. ఒంటినిండా సర్పాలతో, తలమీద పడగతో, ఒడిలో పిల్లవాడితో ఉన్న మానసాదేవి శిల్పాలు మనకు అక్కడక్కడా కనిపిస్తాయి. ఈమె నాగపూజ్యమే కాదు, లోకపూజ్య కూడా. ఈ తల్లిని ఆరాధించినవారు సమస్య కామ్యాలు పొందుతారు.
చెట్టుకొమ్మ, మట్టి కుండ Matti Kunda, నాగరాయి, పుట్ట ఇలా ఏ రూపంలోనైనా ఈమెను పూజిస్తారు. అసలు ఏ రూపమూ లేకుండా ధ్యానం చేయవచ్చు. ఇటువంటి ఆచారయుక్తమైన ఆలయాల్లో మూలవిరాట్టుగా, అటు గ్రామదేవతగానూ మానసాదేవి విశేషంగా పూజలందుకుంటున్నది.