khammam crime news today I హత్య చేసే అంత ఘర్షణ ఏం జరిగింది?
ఖమ్మం : లారీ క్లీనర్ను చంపిన డ్రైవర్ తనతో పాటు విధుల్లో ఉన్న లారీ క్లీనర్ను డ్రైవర్ ఇనుపరాడ్డుతో కొట్టి, కత్తితో పొడిచి అతికిరాతకంగా చంపిన ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. ఏపీలోని కాకినాడకు చెందిన వీరిద్దరూ కరీంనగర్కు వచ్చి తిరిగి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. సినీ ఫక్కీలో డ్రైవర్ మృతదేహంతో వచ్చి ఖమ్మ జిల్లా కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఇదంతా చూసిన పోలీసులే విస్మయం చెందారు.
![]() |
వివరాల్లోకి వెళితే.. కాకినాడకుచెందిన డ్రైవర్ నైఫ్రాజు, క్లీనర్ రాజు నూకలలోడు కోసం కరీంనగర్ వచ్చారు. తిరుగు ప్రయాణంలో లారీ లోడుకు పట్టా కట్టే క్రమంలో కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా డ్రైవర్ నైఫ్ రాజు క్లీనర్ ను రాడ్డుతో కొట్టి, కత్తితో పొడిచాడు. మృతదేహాన్ని లారీలో వేసుకుని కాకినాడకు బయలుదేరాడు. ఖమ్మం దాడగానే జాతీయ రహదారి పక్కనే ఉన్న కొణిజర్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. హత్య చేసి లారీతో సహా స్టేషన్ కు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. డ్రైవర్ మాత్రం తనను కాపాడుకోవడానికి తానే పొడిచానని, క్లీనర్ కత్తితో తనను హత్య చేయాలని చూశాడని చెబుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.