Joint Collector Sivashankarఏ.కొండూరు: సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ అన్నారు. ఏ.కొండూరు మండలం ఏ.కొండూరు తండాలోని గ్రామ సచివాలయాన్ని శనివారం జాయింట్ కలెక్టర్ ఆసక్మీకంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. సచివాలయంలో సిబ్బంది నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన పేదవారికి అందించేందుకు ముఖ్యమంత్రి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. సంక్షేమ ఫలాలు నూరు శాతం అర్హులైన లబ్ధిదారులకు అందేలా సచివాలయ వాలంటీర్లు కృషి చేయాలన్నారు. వాలంటీర్లు(volunteers) తమ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు సంబంధించిన ఏఏ సంక్షేమ పథకాలకు అర్హులో గుర్తించి, ఆయా పథకాలు పేదలందరికీ వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ పరిధిలో ప్రభుత్వ సక్షేమ పథకాలను పొందిన లబ్ధిదారుల జాబితాను పథకాల వారీగా సూచివాలయ నోటీసు బోర్డులో తప్పని సరిగా ప్రదర్శించాలన్నారు.
సచివాలయ పరిధిలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ సచివాలయ సిబ్బంది ఆదేశించారు. అనంతరం రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి రైతులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ పరిధిలో రైతులందరి వివరాలను ఈ-క్రాప్(e corp)లో నమోదు చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్(Joint Collector) వెంట సచివాలయ సిబ్బంది, రైతు భరోసా(rythu bharosa) కేంద్రం సిబ్బంది, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?