covid update: ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు కన్పిస్తున్నాయి. గత రెండు రోజులుగా 20 వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు, తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.06 లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించారు. అందులో 23,529 మందికి పాజిటివ్ నిర్థారణ(covid update) అయ్యింది.
క్రితం రోజు కేసులు (18,870) తో పోలిస్తే 24 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. అయితే అదే సమయంలో మరణాలు కాస్త తగ్గడం ఊరటనిస్తోంది. అంతక్రితం రోజు 378 మంది కరోనాతో మరణించారు. నిన్న(బుధవారం) ఆ సంఖ్య 3.37 కోట్లకు దాటింది. ఇప్పటి వరకు 4,48,062 మందిని వైరస్ పొట్టన బెట్టుకుంది. కొత్తగా నమోదైన మరణాల్లో సగం ఒక్క కేరళలోనే వెలుగు చూడటం ఆ రాష్ట్ర ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఆ రాష్ట్రంలో 12,161 కొత్త కేసులు నమోదవ్వగా 155 మంది కరోనాతో మరణించారు.


కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువుగా ఉంటుండటం సానుకూలాంశం. నిన్న మరో 28, 718 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 3.38 కోట్ల మంది కోవిడ్ను జయించారు. రికవరీ రేటు 97.85 శాతానికి పెరిగింది. ఇక కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల సంఖ్య 3 లక్షల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,77,020 మంది వైరస్తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.82 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం మరో 65,34,306 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 88.34 కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?