covid death stories హైదరాబాద్లోని ఇటీవల ఓ వ్యక్తి కరోనా రావడంతో చికిత్స పొందుతూ కార్పొరేట్ ఆసుపత్రిలో చనిపోయాడు. వెంటనే ఓ ఏజెన్సీ వారు ఆ వ్యక్తి భార్యకు ఫోన్ చేశారు. సంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. రూ.30 వేలు ఫీజు చెల్లిస్తే చాలన్నారు. రఘురాజ్ కుటుంబ సభ్యలు దీనికి అంగీకరించారు. దీంతో ఏజెన్సీ వారే ఆ వ్యక్తి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు(covid death stories) పూర్తి చేశారు.
హైదరాబాద్(Hyderabad): కరోనా వల్ల మనిషి బతుకు మారింది. కట్టుబాట్లను, సంప్రదాయాలను చెరిపేస్తూ ఆఖరికి అంత్యక్రియల తీరునూ మార్చింది. ఇప్పుడు అంత్యక్రియల్లో ఆచారాలు లేవు. పాడే మోసేందుకు ఆ నలుగురూ లేని దయనీయ పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో అంత్యక్రియల వ్యాపారం పుట్టుకొచ్చింది. ‘అంత్యక్రియలు మేం చేస్తామంటూ..’ ఏజెన్సీలు పుట్టుకొ చ్చాయి. మీరు ఫీజు చెల్లించండి.. చాలా మిగతావి మేం చూసుకుంటాం. అని చెబుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా తో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించాలంటే బంధువులకు పెద్ద కష్టంగా మారింది. వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోనేమోనని భయంతో సొంత వాళ్లు కూడా దగ్గరికి రాలేని పరిస్థితి వచ్చింది. దీంతో అంత్యక్రియలు ఇతరులు చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మున్సిపల్ సిబ్బంది అంతా చూసుకుంటున్నారు. అయితే తమ వాళ్ల అంత్యక్రియాలు ఎలా చేస్తారోననే ఆందోళన, ఇన్నాళ్లూ తమతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎవరూ లేని అనాథగా వెళ్లిపోతున్నారనే బాధ చాలా మందిలో మెదులుతుంది.
చనిపోగానే వస్తున్న ఫోన్!
ఆసుపత్రుల్లో పేషెంట్ చనిపోగానే వారి కుటుంబ సభ్యలకు ఏజెన్సీ నిర్వాహకులే ఫోన్ చేస్తున్నారు. ‘మీ ఫ్యామిలీ మెంబర్ కరోనాతో చనిపోయారు. హైదరాబాద్లో ఏజెన్సీ ఉంది. మీరు ఆస్పత్రికి వచ్చే సమయం చెబితే అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఫీజు రూ.30 వేలు. అంతా కరోనా రూల్స్ ప్రకారమే చేస్తాం. శ్మశాన వాటిక లోపలికి రావాలనుకునే వారు కచ్చితంగా పీపీపీ కిట్లు ధరించాలి. ఒక్కో కిట్ రూ.1200 అందనంగా చెల్లించాలి.’ అని వివరిస్తున్నారు. ‘గతంలో అంబులెన్స్ సర్వీ సులు నిర్వహించేవాళ్లం. చనిపోయిన వారి మృతదేహాన్ని ఇంటి వరకు తరలించేందుకు రూ.5 వేలు తీసుకునే వాళ్లం. ఇప్పుడు కరోనా వల్ల చనిపోయిన డెడ్ బాడీలకు అంత్యక్రియలు చేసే వర్క మొదులు పెట్టాం. ప్రైవేటు ఆస్పత్రుల్లో చనిపోయే వారి అంత్యక్రియలు ఎక్కువ శాతం మేమే చేస్తున్నాం.’ అని హైదరాబాద్ లోని ఓ స్టాండ్ప్లస్ ఏజెన్సీ నిర్వహాడు చెబుతున్నాడు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో చనిపోయిన వారి అంత్యక్రియలను సొంతకుటుంబీకులే కొంచెం దూరం ఉండి చేయించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కొత్తగా ప్రైవేటు ఏజెన్సీలు ప్రారంభమయ్యాయి. హస్పిటల్ నుంచి శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలించి, సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. కరోనా రూల్స్ పాటిస్తున్నారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది కుటుంబసభ్యులను రానివ్వడం లేదు. దహనం చేస్తే..కుటుంబంలో ఒకరితో దూరం నుంచి చితికి నిప్పు పెట్టిస్తున్నారు. చితాభస్మం ఇస్తున్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!