Water Pollution: Jaggayyapeta(Autonagar)లో కలుషిత నీరుతో అవస్థలు!
Water Pollution: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణం పరిధిలో ఉన్న ఆటోనగర్ ప్రాంతంలో సాయినగర్లో కలుషిత నీరుతో స్థానికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అసలే వేసవి కాలం కావడంతో తాగడానికి కానీ, ఇతర పనులకు వినియోగించుకోవడానికి వీలే లేకుండా కలుషితమైన నీరు త్రాగ లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని కారణం ఆటోనగర్లో ఉన్న వివిధ రకాల కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాల వల్లే నీరు కలుషితమవుతున్నట్టు బాధితులు తెలుపుతున్నారు.


సాయినగర్ ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే!
ఆటో నగర్ ప్రాంతంలో ఉన్న సాయినగర్లో టిడిపి జాతీయ కోశాధికారి, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మంగళవారం పర్యటించారు. ఆటో నగర్కు సంబంధించిన వివిధ కెమికల్ ప్లాంట్ల నుండి వస్తున్నటువంటి వ్యర్థాల వల్ల సాయి నగర్లో గ్రౌండ్ లెవల్ లో ఉన్న మంచి నీరు కలుషితమై పోతుందని శ్రీరాం రాజగోపాల్ తాతయ్యకు స్థానికులు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా బాధితులతో కలిసి ఆ కలుషితమైనటువంటి నీటిని పరిశీలించారు. నీరు కనీసం త్రాగడానికి, వాడుకోవడానికి కూడా ఉపయోగప డవ ని గ్రహించారు. అనంతరం తాతయ్య స్థానిక తాశీల్దార్, కలెక్టర్, ఫ్యాక్టరీలకు అనుమతులు ఇచ్చినటు వంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. సాయి నగర్లోని గ్రౌండ్ లెవల్ వాటర్ ఎందువల్ల ఇంత కలుషితమైపోతుందో పరిశీలించి వారికి త్రాగునీటిని సకాలంలో అందించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికుల దాహార్తిని తీర్చేందుకు తాతయ్య తన బాధ్యతగా భావించి మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు.


- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం