Chigullapalli Manjula Ramesh: వికారాబాద్: మున్సిపల్ ఛైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు బూస్టర్ డోస్ క్యాంపు కార్యక్రమం సోమవారం జరిగింది. ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు బూస్టర్ డోస్ వేసినట్టు వారు తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చైర్ పర్సన్ దగ్గరుండి పర్యవేక్షించారు.
బూస్టర్ డోస్ ను నిర్లక్ష్యం చేయరాదు:Chigullapalli Manjula Ramesh
ఈ సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు, సిబ్ంది సెకండ్ డోస్, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ తప్పకుండా వేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు ఎప్పుడు ప్రజల మధ్య ఉంటారు కాబట్టి వ్యాక్సినేషన్ విషయంలో నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!