grama ward Sachivalayam : సచివాలయ వ్యవస్థలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి చర్యలు ప్రారంభించింది. ఇకపై సచివాలయ పరిపాలన పర్యవేక్షణ బాధ్యత ఆర్డిఓ, తహశీల్దార్లదే నని ప్రభుత్వం స్పష్టం చేసింది. సచివాలయ డిడిఓలు పంచాయతీ సెక్రటరీలను తొలగించి విఆర్వోలకు అధికార పగ్గాలు అప్పగిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా గ్రామ సచివాలయం వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికలైన గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు ఇక రెవెన్యూ పరిధిలోకి వెళ్ల నున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన విప్లవాత్మక జీవోలో సచివాలయ పరిపాలనా బాధ్యతలను పంచాయతీ సెక్రటరీల నుండి తొలగించి రెవెన్యూ శాఖలోని వీఆర్వోలకు అప్పగించింది. దీంతో గ్రామ సచివాలయ పరిపాలన బాధ్యతలు వీఆర్వోలు చూడాల్సి వస్తుంది. ఇకపై గ్రామ సచివాలయంలో జరిగే నవరత్నాల సంక్షేమ పథకాల అమలు వీఆర్వో ఆధ్వర్యంలో జరుగుతాయి. అంతేగాక గ్రామ సచివాలయాల ఉద్యోగుల పర్యవేక్షణ బాధ్యత కూడా వీఆర్వోలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వలు జారీ చేసింది.
- Pension పై ఏపీ ప్రభుత్వం కొత్త రూల్ | బోగస్ కార్డుల ఏరివేతకేనా?
- Big Breaking : Nashik లో Oxygen tank లీకై 22 మంది మృతి
- Love Failure Private Song | Thattukolene love Failure Mp3 Song Free Download
- Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమానస్పద మృతి
- Tiger Kid : మద్రాస్ సిమెంట్ క్వారీ సమీపంలో పులి పిల్ల? | Jaggayyapeta Madras Cement Factory