CBI Investigation: వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది. వివేకా మృతదేహానికి పోస్టుమార్గం చేసిన డాక్టర్ నివేదికను మరోసారి సీబీఐ అధికారులు పరిశీలించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ (CBI Investigation)దూకుడు పెంచింది. వరుసగా 83వ రోజు పలువురు అనుమానితులను ప్రశ్నిస్తోంది. వివేకా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ ఆనంద కుమార్ను సీబీఐ అధికారులు విచారించారు. అదే విధంగా రిపోర్టును మరోసారి పరిశీలించారు.
నార్కో పరీక్షలపై విచారణ వాయిదా
వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్కు నార్కో అనాలసిస్ పరీక్షల అనుమతి కోసం సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై జమ్మలమడుగు కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.
45 నిమిషాల పాటు ఇరు పక్షాల న్యాయవాదులు ఆన్లైన్లో వాదనలు వినిపించారు. వాదనలు విన్న జమ్మలమడుగు మెజిస్ట్రేట్ విచారణను వచ్చే నెల 1కి వాయిదా వేశారు.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!