Car Accident at Gowravaram | కృష్ణ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం జాతీయ రహదారి 65 రోడ్డుపైన గౌరవరం కాలువ వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. గౌరవరం వద్ద కల్వర్డును కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో సహా ఐదుగురు మృతి చెందారు.
విజయవాడ- హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. గాయపడిన వారిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఓ చిన్నారితో సహా మరో మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
Car Accident at Gowravaram | మృతులు హైదరాబాద్ వాసులు
పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్లోని చందానగర్ హుడా కాలనీ చెందిన వారుగా జగ్గయ్యపేట పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం జరిగే సమయంలో కారులో ముగ్గురు మహిళలు, ఇద్దరు వ్యక్తులు, ఓ పాప ఉన్నారు. మృతులను కుటుంబరావు, ఆయన భార్య మార్తమ్మ, శాంతి, ఇందిర, కుటుంబరావు మనవరాలు ప్రిన్సీ(ఆరు నెలలు) గా గుర్తించారు. కుటుంబరావు కొడుకు జోషీ జగ్గయ్యపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మనమరాలు ప్రిన్సీ అన్నప్రాసన కోసం వీరు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

అతివేగం కారణంగా కారు డ్రైవర్ గౌరవరం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువ వంతెనపై కల్వర్టు వద్ద మలుపు గమనించలేక పోయారని, అందువల్ల ప్రమాదం జరిగి ఉండవొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు కల్వర్టును ఢీకొట్టకపోయుంటే నేరుగా వెళ్లి కాలువలో పడేదని స్థానికులు చెబుతున్న మాట. ప్రస్తుతం నాగార్జున సాగర్ కాలువ పూర్తిస్థాయి నీటిమట్టంతో ప్రవాహం కొనసాగుతూ ఉంది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ