Bomb Blast : అర్థరాత్రి బాంబు పేలుడు శునకం, వరహం మృతి!
Bomb Blast : తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. యూనివర్శిటీ ఆవరణంలో బుధవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో రెండు నాటు బాంబులు భారీ శబ్ధంతో పేలాయి. ఈ ఘటనలో ఓ శునకం, వరాహం మృతి చెందాయి.
యూనివర్శిటీ ఆవరణంలో ఐ – బ్లాక్ సమీపంలోఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే క్యాంపస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఇంకేమైనా బాంబులు ఉన్నాయేమోనని అనుమానంతో క్షుణ్ణంగా గాలించారు. యూనివర్శిటీలోఅడవి పందులను వేటాడేందుకు వేటగాళ్లు నాటు బాంబులను పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఘటనకు కారణమైన ఇద్దరు వేటగాళ్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Pension పై ఏపీ ప్రభుత్వం కొత్త రూల్ | బోగస్ కార్డుల ఏరివేతకేనా?
- Big Breaking : Nashik లో Oxygen tank లీకై 22 మంది మృతి
- Love Failure Private Song | Thattukolene love Failure Mp3 Song Free Download
- Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమానస్పద మృతి
- Tiger Kid : మద్రాస్ సిమెంట్ క్వారీ సమీపంలో పులి పిల్ల? | Jaggayyapeta Madras Cement Factory