Tiruvuru : కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలో శుక్రవారం భారత్ బంద్(Bharath Bandh ప్రశాంతంగా కొనసాగింది. వ్యాపార సముదాయాలు, విద్యాలయాలు స్వచ్ఛదంగా ఆయా యజమానులు మూసివేసి బంద్కు సంఘీభౄవం తెలిపారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. ఉదయం నుండి సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు తిరువూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలైన పోస్టాఫీసు, బిఎస్ఎన్ఎల్ తో పాటు బ్యాంకులను, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. అనంతరం టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సిపిఎం, సిపిఐ నాయకులు కలిసి బోసుబొమ్మ సెంటర్ లో ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. అందరూ కలిసి మెయిన్ రోడ్డులో బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడక్కడా తీసిఉన్న షాపులను మూసివేయిస్తూ బంద్ను విజయంతం చేశారు.

గంపలగూడెం, ఊటుకూరులో ప్రశాంతంగా భారత్ బంద్!
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక, ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ గంపలగూడెం మండలంలో పాటు, ఊటుకూరు గ్రామంలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. వ్యాపార వర్గాలు, ఆటో యూనియన్లు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు, ప్రజలందరూ చిన్న పిల్లలు సైతం బంద్కు మద్దతు తెలిపారు. బీజేపీ పార్టీ అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన తెలుపుతూ బంద్ ను జయప్రదంగా కొనసాగిస్తున్నారు.
- Pension పై ఏపీ ప్రభుత్వం కొత్త రూల్ | బోగస్ కార్డుల ఏరివేతకేనా?
- Big Breaking : Nashik లో Oxygen tank లీకై 22 మంది మృతి
- Love Failure Private Song | Thattukolene love Failure Mp3 Song Free Download
- Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమానస్పద మృతి
- Tiger Kid : మద్రాస్ సిమెంట్ క్వారీ సమీపంలో పులి పిల్ల? | Jaggayyapeta Madras Cement Factory