గుంటూరులో షాకింగ్ ఘటన
గుంటూరు : దూర ప్రాంతాల నుంచి వచ్చి బస్సు దిగుతున్న ప్రయాణికులను టార్గెట్ చేస్తున్నారు ఓ ముఠా. గమ్య స్థానానికి తీసుకెళ్తామంటూ ఆటో ఎక్కించుకొని తీసుకెళ్లి దోచు కుంటున్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. బస్టాండ్ దగ్గర మాటు వేస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు వల విసిరి ఆటో ఎక్కించుకుంటారు.
వాళ్లని నమ్మి ఆటో ఎక్కారా? ఇక అంతే సంగతలు. ఆటోను సగం దూరం పోనిచ్చి నిలువుదోపిడీ చేసి పరావుతారు. ప్రయాణికులను ఆటో ఎక్కించుకొని దోపిడీలకు పాల్పడుతున్న కిలాడీ గ్యాంగ్ను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
గుంటూరు నగరంలో దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల గ్యాంగ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈజీమనీకి అలవాటుపడిన ఏడుగురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. బస్టాండ్ వద్ద మాటువేసి దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుంటారు. మధ్యలో మరికొందరు ప్రయాణికుల మాదిరిగా ఆటో ఎక్కి కూర్చుంటారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ప్రయా ణికులను బెదిరించి నిలువు దోపిడీ చేస్తారు. డబ్బులు దోచుకొని అక్కడి నుంచి పరారవుతారు.
ఇటీవల ఇలాంటి దోపిడీ ఘటనలు పోలీసుల దృష్టికి రావడంతో అర్బన్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్టు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ప్రయాణికులను దోచుకుంటున్న ఏడుగురు సభ్యుల గ్యాంగ్ని కనిపెట్టి నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.లక్షా 20 వేల నగదు, ఆటోని స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో నిందితులను అరెస్టు చేయడంతో ప్రతిభ కనపరిచిన ఈస్ట్ డీఎస్పీ సీతారామయ్య, పాత గుంటూరు సీఐ సురేష్బాబు ఎస్ఐ మీరాజ్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.