Suicide Attempt : గుంటూరు జిల్లాలో మాచర్లలో సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను నిలువరించే ప్రయత్నం చేశారు. ఆస్తి పంపకాల నేపథ్యంలో మనస్థాపం చెందినట్టు మహిళ పేర్కొంది.
Suicide Attempt : ఆస్తి పంపకాల విషయంలో మనస్థాపం చెందిన ఓ మహిళ తన ఇద్దరి పిల్లలతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన గుంటూరు జిల్లా మాచర్లలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మండలంలోని సబ్ రిజిస్ట్రర్ కార్యాలయ ఆవరణం ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అక్కడ ఉన్న వారు అక్కడ ఉన్న వారు అప్రమత్తమై అడ్డుకున్నారు. వెల్డుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన సాని పద్మ అనే మహిళ తన భర్తకు రావాల్సిన ఆస్తులు అత్తింటి వారు ఇంత వరకూ పంపిణీ చేయలేదని పేర్కొంది.
ప్రస్తుతం ఆస్తుల పంపకాల విషయంలో మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్టు మహిళ పేర్కొంది. తన భర్త పేరు కాకుండా తన పిల్లల పేరుమీద ఆస్తులు రాయాలని అడగటంలో ఇంట్లో వివాదం జరిగినట్టు తెలిపింది. తనకు న్యాయం జరగాలని, తన ఇద్దరు కుమారులతో కలిసి సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం వద్దకు చేరుకొని ఆత్మహత్యకు యత్నంచింది. పోలీసులు మహిళను విచారించి వివరాలు సేకరించారు.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం